Road Accident In Allagadda: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సులు ఆళ్లగడ్డ సమీపంలో ప్రమాదానికి గురయ్యాయి. క్షతగాత్రులను నంద్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటన స్థానికంగా విషాదం నింపింది.