ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ( ఆషా) సమ్మెను విరమించటంతో ఎన్టీఆర్ వైద్య సేవలను పునరుద్ధరించారు. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేసింది. అయితే వేయి కోట్ల రూపాయలను పది రోజులలోగా ఆస్పత్రులకు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వటంతో.. సమ్మె విరమించారు. దీంతో ఎన్టీఆర్ వైద్య సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.