జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బటి తండాలో ఆస్తి కోసం కన్నపిల్లలనే చంపేందుకు తండ్రి పన్నిన కుట్ర విఫలమైంది. రెండో భార్యతో కలిసి విషం కలిపిన బిస్కెట్లతో ఇద్దరు కుమారులను హతమార్చాలని చూసిన బానోత్ శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కుట్రలో భాగస్వామి కావాల్సిన వ్యక్తి ముందే హెచ్చరించడంతో పెను ప్రమాదం తప్పింది. నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్సై నరేశ్ వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.