ఆస్తి కోసం కన్నతల్లిని విస్మరించి భూమిని పంచుకున్న కుమారుడు, మనవడి తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇచ్చిన భూ బదిలీ ఉత్తర్వులను సవాలు చేస్తూ మనవడు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బి. విజయ్సేన్ రెడ్డి విచారణ జరిపారు. 77 ఏళ్ల నాయనమ్మకు వెంటనే లక్ష రూపాయలు చెల్లించాలని మనవడిని ఆదేశిస్తూ.. మానవీయ కోణంలో ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేశారు.