నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన మూడేళ్ల పిల్లాడి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. మార్చి 04వ తేదీన ఈ కిడ్నాప్ జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో ఆవరణలో ఆడుకుంటున్న మూడేళ్ల పిల్లాడు ఉన్నట్టుండి మాయమవటంతో.. అంతా వెతికి ఎక్కడా దొరకకపోవటంతో.. పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీని గమనించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.