కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దారుణం చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు ఆస్పత్రి వద్ద ఓ భర్త, తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. విచక్షణారహితంగా కత్తితో పొడవటంతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కత్తితో పొడిచిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆస్పత్రి వద్ద భయానక వాతావరణం ఏర్పడింది.