ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగాలను విలీనం చేస్తూ టీజీ సేఫ్ పేరిట ఏకీకృత పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి అవినాశ్ మహంతి దీనికి తొలి కమిషనర్గా నియమితులయ్యారు. మహారాష్ట్ర, కర్ణాటక నమూనాలను అధ్యయనం చేసి రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా.. కల్తీలపై ఉక్కుపాదం మోపడంతో పాటు సురక్షిత ఆహారం, నాణ్యమైన ఔషధాలు అందించేలా నిఘా, తనిఖీలను మరింత కఠినతరం చేయనున్నారు. తొలి దశలో అత్యధిక వ్యాపార సంస్థలున్న కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో దీన్ని అమలు చేయనున్నారు.