తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. మెదక్ జిల్లాలోని పలుగుగడ్డ గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండటంతో ఆర్డినెన్స్ ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..