విశాఖ స్టీల్ప్లాంట్ ప్రమాదంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ప్రమాద ఘటన తనను కలిచివేసిందన్న షర్మిల.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. బాధితుల కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనకు అమాయక ప్రాణాలు ఆహుతి అయ్యాయంటూ షర్మిల మండిపడ్డారు.