ఇంటర్ ఫెయిల్ అయిన షేక్ జానీ అలియాస్ హరినాథ్ రావు అనే వ్యక్తి సుమారు 500 మంది మహిళలను మోసం చేశాడు. అది కూడా యూట్యూబ్ వీడియోలు చూసి.. పక్కా ప్లాన్తో దందా చేయడం మొదలు పెట్టాడు. ఇలా నెలకు 2-3 లక్షలు సంపాదించేవాడు. ఇలా సంపాదించిన మొత్తంలో నగరంలో 2 ఇళ్లు, కారు, బుల్లెట్ బైక్ కొని.. లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడు. అయితే ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఇతగాడి మోసం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..