రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న ఈ సంస్కరణల ప్రకారం, రాత పరీక్షకు 80 శాతం మార్కులు.. ఇంటర్నల్స్కు 20 శాతం మార్కులు కేటాయిస్తారు. కొత్తగా 'ఏసీఈ' గ్రూపు ప్రవేశపెట్టడంతో పాటు, గణితం, భౌతిక, రసాయనశాస్త్రాల్లో సిలబస్ను తగ్గించి, ఎన్సీఈఆర్టీ ప్రమాణాలకు అనుగుణంగా మార్చనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు అమల్లోకి రాబోతున్నాయి.