తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను విస్తరిస్తోంది. తాజాగా 73 టీపీఎస్ల నిర్మాణానికి రూ.699.89 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఇందులో రూ.209.96 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి, రూ.489.93 కోట్లు ఏఐఐబీ రుణంగా సమకూరనున్నాయి. దీంతో ఇప్పటివరకు అనుమతులు పొందిన టీపీఎస్ల సంఖ్య 78కు చేరింది. క్రీడా మైదానాలు, ల్యాబ్లు, గ్రంథాలయాలు, ప్రత్యేక ఆట స్థలాలతో సెమీ రెసిడెన్షియల్ విధానంలో వీటిని అభివృద్ధి చేయనున్నారు.