కరీంనగర్ జిల్లా కేంద్రంలో కుల వివక్ష తీవ్రరూపం దాల్చింది. కిసాన్ నగర్లోని కొన్ని ఇంటి యజమానులు తమ కిరాయి ఇంటి బోర్డుపై కేవలం హిందువులకు మాత్రమే అని రాసి.. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వమని పేర్కొనడం స్థానిక వివాదానికి దారితీసింది. శాస్త్ర, సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్నా.. ప్రజల్లో కులం పిచ్చి వీడకపోవడం విమర్శలకు తావిస్తోంది. దళిత సంఘాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.