ఇంటి ముందు బోల్తాపడ్డ ట్రక్కు.. తృటిలో తప్పించుకున్న బాలిక

2 months ago 11
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని బహార్‌పేట్‌లో ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. కొడంగల్ చౌరస్తా నుండి హైదరాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న స్క్రాప్ డీసీఎం (AP 22 TA 5004), బహార్‌పేట్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో డీసీఎంలోని తుక్కు అంతా పక్కనే పార్క్ చేసి ఉన్న ఒక ఆటో, నాలుగు బైక్‌లపై పడటంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే, అక్కడే ఉన్న చికెన్ సెంటర్ ముందు నిలబడిన ఒక చిన్నారిపై స్క్రాప్ పడటంతో, స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది క్రేన్ సాయంతో రోడ్డును క్లియర్ చేశారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మోహన్ కృష్ణ తెలిపారు.
Read Entire Article