మంగళవారం రాత్రి దుండిగల్లోని బౌరంపేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. కీర్తి హోమ్స్ కాలనీలోని ఒక ఇంటిపై దాడి చేసిన ఇద్దరు ముసుగు వ్యక్తులు 14 తులాల బంగారు ఆభరణాలు , రూ. 20,000 నగదును దొంగిలించారు. ఈ దోపిడీ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. బాధితులు ఫిర్యాదు చేయగా.. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.