వయసు పెరిగేకొద్దీ జ్ఞానం పెరుగుతుందంటారు. జీవితం నేర్పించిన అనుభవాలతో యువతకు జీవిత పాఠాలు నేర్పించాల్సిన సమయమది. కానీ పెద్దల బుద్దే పక్కదారి పడితే.. ఇలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించాడు 70 ఏళ్ల వృద్ధుడు. అయితే కేకలు విని చుట్టుపక్కలవారు రావటంతో అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది.