దివ్యాంగుల పింఛన్ ఇప్పిస్తానంటూ వృద్ధురాలి వద్ద ఉన్న బంగారు నగలు కాజేసిన ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటుచేసుకుంది. ప్రొద్దుటూరులో ఉండే లక్ష్మిదేవి అనే మహిళకు దివ్యాంగ పింఛన్ ఇప్పిస్తానంటూ ఆగంతకులు నమ్మబలికారు. ఫోటో తీయాలని చెప్పి.. అందుకు ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసేయాలని సూచించారు. బంగారు నగలు తీసేయగానే.. ఆమెను గదిలో బంధించి.. నగలతో ఉడాయించారు. ఈ ఘటనపై బాధితురాలు, ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.