కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇద్దరు పీఎంలు ఉన్నారంటు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒకరు నరేంద్ర మోదీ అయితే మరొకరు ప్రతి గ్రామంలో సేవలు అందించే పోస్ట్ మాన్ అంటూ పెమ్మసాని అభివర్ణించారు.. రాజోలులో కొత్త పోస్టాఫీసును ప్రారంభించిన సందర్భంగా పోస్టాఫీసుల ఆధునీకరణ గురించి ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలకు పోస్టాఫీసులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆయన తెలిపారు.