చెడు వ్యసనాలకు బానిసైన మనుషులు తమ వ్యక్తిత్వాన్ని, విచక్షణను పూర్తిగా కోల్పోతుంటారు. ఈ విషయం ప్రతిసారి నిరూపితమవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే.. ఓ మనవడు.. తన సొంత అమ్మమ్మను అతి క్రూరంగా గొంతు నులిమి హత్య చేశాడు. అది కూడా తాను మద్యం తాగేందుకు ఆమె మెడలో ఉన్న బంగారు గుండ్లు ఇవ్వాలని. ఈ దారుణమైన ఘటన.. సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.