ఏపీ, తమిళనాడు, కర్ణాటకలతో పోలిస్తే తెలంగాణ రైతులకు తక్కువగా అప్పులు ఉన్నాయని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. 2025 డిసెంబరు నాటికి తెలంగాణ రైతుల అప్పు రూ.1.75 లక్షల కోట్లుగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రూ.2 లక్షల రుణమాఫీ వల్లే ఈ లబ్ధి చేకూరిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మరోవైపు, బహిరంగ మార్కెట్ రుణాల సేకరణలో తెలంగాణ రూ.69,300 కోట్లతో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.