కామారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడిపై విజిలెన్స్ పోలీసులు జరిమానా విధించి, కేసు నమోదు చేయడం కలకలం రేపింది. పాత ఇంటి మీటర్నే కొత్త నిర్మాణానికి వాడటమే దీనికి కారణం. అయితే ఇంటి నిర్మాణానికి కేటగిరీ మార్చాల్సిన అవసరం లేదని విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేయడంతో అధికారుల చర్యలపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.