ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కల నెరవేరనుంది. ఇంటి నిర్మాణంలో భాగంగా విడతల వారీగా డబ్బులను అకౌంట్లోకి జమ చేయనుండగా.. మొదటి విడత కింద రూ.లక్ష ఎప్పుడు జమ చేసే విషయంపై క్లారిటీ వచ్చింది. దీనికి సంబంధించి నిధులను కూడా ప్రభుత్వం సమకూర్చింది. ఎన్నికల కోడ్ కారణంగా నిలిచి పోయిన ఈ ప్రక్రియ వేగవంతం కానుంది.