తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలును వేగవంతం చేయడానికి కీలక చర్యలు తీసుకుంటోంది. జిల్లాల హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు (PD)గా గ్రూప్-1 అధికారులను (డిప్యూటీ కలెక్టర్లు) నియమిస్తోంది. ఇప్పటివరకు 3.71 లక్షల ఇళ్లు మంజూరు కాగా.. 40 శాతం లోపే గ్రౌండింగ్ అయ్యాయి. సిబ్బంది కొరత, నిధుల జాప్యం, నిర్మాణ సామగ్రి ధరలు, లబ్ధిదారుల ఎంపికలో అస్పష్టత వంటివి జాప్యానికి కారణాలుగా అధికారులు భావిస్తున్నారు. ఈ సవాళ్లను అధిగమించి పథకాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా గ్రూప్-1 అధికారులను పీడీలుగా నియమిస్తోంది.