పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. జనవరి 26న ఈ పథకం ప్రారంభం కానుంది. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం అందించనుండగా.. ఇసుకను ఉచితంగా సరఫరా చేసేందుకు సిద్ధమైంది. ఇక స్టీల్, సిమెంట్ కూడా సబ్సిడీకి ఇవ్వాలని భావిస్తోంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇటుకలను మహిళా సంఘాల ద్వారా తయారు చేయించాలని భావిస్తున్నారు. తద్వారా డ్వాక్రా సంఘాలకు ఆర్థిక భరోసా ఇచ్చినట్లు అవుతుందని సర్కార్ యోచిస్తోంది.