ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. మే మొదటి వారంలోపు నియోజకవర్గానికి 3,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. సిమెంట్ పరిశ్రమలతో చర్చించి తక్కువ ధరకు సిమెంట్ అందించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 11 జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.