ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ హెచ్చరించారు. లబ్ధిదారులకు ఇప్పటికే రూ.1000 కోట్లు అందజేశామని, ఇళ్ల పురోగతిని లబ్ధిదారులే నేరుగా యాప్లో అప్లోడ్ చేయవచ్చని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సకాలంలో బిల్లులు అందేలా చూడాలని ఆదేశించారు.