ఇందిరమ్మ ఇండ్ల పథకం అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి అధికారులను ఆదేశించారు. అనర్హులకు ఇండ్లు కేటాయించారని తెలితే.. అవి ఏ దశలో ఉన్నా ఆపేస్తామని చెప్పారు. ఎలాంటి లోటు పాట్లకు తావు లేకుండా సాంకేతికతను ఉపయోగించి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.