తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు. లబ్ధిదారులు ఉచితంగా అందిస్తున్న 40 టన్నుల ఇసుకను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు 3 లక్షలకు పైగా ఇళ్లు మంజూరు కాగా, 1.03 లక్షలు గ్రౌండింగ్ అయ్యాయని చెప్పారు. కొన్ని జిల్లాల పనితీరు మెరుగుపరచుకోవాలని అధికారులకు సూచించారు.