తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం ప్రారంభించారు. అయితే.. గ్రామ సభల్లో ప్రకటించిన జాబితాల్లో చాలా మంది అర్హుల పేర్లు రాకపోవటంతో.. మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. అయితే, గ్రేటర్ జిల్లాల పరిధిలో మాత్రం ఈ పథకం ఇంకా ప్రారంభం కాలేదు. దాదాపు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.