తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పథకాలలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. మొదటి విడతలో 72,045 మందికి ఇళ్లు మంజూరు చేసి, ప్రస్తుతం తొలివిడతలో అర్హులైన వారు కాకుండా.. మిగిలిన దరఖాస్తులను వెరిఫికేషన్ చేస్తోంది. అతి పేద కుటుంబాలను ప్రాధాన్యంగా గుర్తిస్తూ, అర్హులైన వారికి నూతన ఇళ్లను మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోంది.