హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. తొలి విడతలో రూ.807.40 కోట్లతో చేపడుతున్న నిర్మాణాలకు వచ్చిన 60,720 దరఖాస్తుల్లో 40,900 మందిని అర్హులుగా గుర్తించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు అర్హుల సమక్షంలో లక్కీ డ్రా ద్వారా ఫ్లాట్లు కేటాయించనున్నారు. ఎంపిక కానివారికి రూ.10 వేల ఈఎండీ తిరిగి చెల్లిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.