తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరటనిచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఉక్కు ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతోంది. మార్కెట్ ధరల కంటే తక్కువకు సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు కోరింది. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఇందిరమ్మ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.