ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. ఈనెలాఖరులోగా లక్ష ఇళ్ల గృహ ప్రవేశం ఉంటుందని అన్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. త్వరలోనే గృహ ప్రవేశాల తేదీని ప్రకటిస్తామన్నారు. ఇక ఏఫ్రిల్లో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కార్యక్రమం మెుదలవుతుందని చెప్పారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా మంజూరు చేస్తామన్నారు.