ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మార్పులు.. రెండో విడతపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

2 hours ago 2
తెలంగాణలో జూన్ 2 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కానుంది. పట్టణ పేదలకు ఉపాధి ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లను నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పాత ఇళ్లపై పై అంతస్తు నిర్మించుకునే వెసులుబాటుతో పాటు ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేసుకునేందుకు నిధులు ఇస్తామన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే రూ. 5 లక్షలు భరిస్తుందని స్పష్టం చేశారు. అలాగే ఈ నెలాఖరులోగా భూముల విలువలను సవరించి ఓఆర్‌ఆర్‌ లోపల ఎకరా కనిష్ఠ ధరను రూ. 15 లక్షలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
Read Entire Article