తెలంగాణలో ఉపాధి హామీ జాబ్కార్డులు లేకపోవడంతో ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. రూ. 60 వేల బిల్లు పొందాలంటే జాబ్కార్డు తప్పనిసరి కావడంతో కొత్త కార్డులు లేనివారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తాత్కాలిక పరిష్కారాలు చూస్తున్నా.. కొత్త కార్డుల మంజూరుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో సమస్య కొనసాగుతోంది.