తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. కాగా, అర్హులైన పేదల కోసం మరో విడత ఇందిరమ్మ ఇళ్ల జాబితాను త్వరలోనే విడుదల చేయనున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులకు ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత తమదేనని ఆయన హామీ ఇచ్చారు.