తెలంగాణలోని నల్లగొండ జిల్లా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. జిల్లాలో రెండు విడతల్లో కలిపి సుమారు 8000కు పైగా ఇళ్లు మంజూరు అయితే.. 2700కు పైగా ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఇంత భారీ ఎత్తున నిర్మాణాలు ప్రారంభం కాకపోవడం అధికారులను కలవరపేడుతోంది. ఈ క్రమంలో ఇంటి నిర్మాణం ఇంకా ప్రారంభించని లబ్ధిదారులకు ప్రభుత్వం మరో నెల రోజుల సమయం ఇచ్చింది. ఆలోపు ఇంటి నిర్మాణం మొదలు పెట్టకపోతే వారి ఇళ్లను రద్దు చేసి కొత్త వారికి అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఆ వివరాలు..