తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా.. ఆర్థిక సాయం పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం కీలకమైన అలర్ట్ జారీ చేసింది. ఆధార్ వివరాలు సరిగా లేని కారణంగా సుమారు 30 శాతం మందికి చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో వారికి ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. వారు రెండు రోజుల్లో ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను సరిచేసుకోవాలని తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం సులభమవుతుందని చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..