పేదల సొంతింటి కలను నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారదర్శకత, నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇసుక సరఫరాకు త్వరలో 'శాండ్ యాప్' రానుంది. నిర్మాణ సామగ్రి ధరల నియంత్రణకు కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటివరకు 2.25 లక్షల మంది లబ్ధిదారులు పనులు ప్రారంభించారు. మహిళా సంఘాల ద్వారా రుణాలు అందిస్తున్నారు.