తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంతిల్లు కట్టుకునే నిరుపేదలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో పాటు సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రిని తక్కువ ధరలకే అందించనుంది. ధరల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఉచిత ఇసుక అందిస్తుండగా, సిమెంట్, స్టీల్ ధరల నియంత్రణతో పేదల ఇంటి కల నెరవేరనుంది. ఈ చర్యల ద్వారా గృహ నిర్మాణ లక్ష్యాలను త్వరగా చేరుకోవాలని ప్రభుత్వం ఆశిస్తోంది.