తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కల సాకారం కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం తెచ్చింది. కానీ ఇప్పుడు అనేక ఇళ్లను రద్దు చేస్తున్నారనే వార్త కలకలం రేపుతోంది. ఇళ్లను మంజూరు చేసే సమయంలో నిబంధనలు పట్టించుకోకుండా, నిర్మాణం మొదలయ్యాక కొర్రీలు పెడుతున్నారని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అసలు దీనికి కారణం ఏమిటి.. ఎందుకు ఇళ్లను రద్దు చేస్తున్నారు వంటి అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ..