ప్రజలకు ఇచ్చిన మాట మేరకే ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాన్ని ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే.. అంత వేగంగా బిల్లులు మంజూరవుతాయని ఆయన ప్రకటించారు. ప్రజల సొమ్ము దోపిడీకి గురి కాకుండా.. పారదర్శకంగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు ఉచిత విద్యుత్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ వంటి పథకాలను గుర్తుచేశారు. ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యమని చెబుతూ.. యువత కోసం 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.