హైదరాబాద్ నగరంలోని ఇళ్లు లేని పేదలకు సర్కార్ తీపి కబురు చెప్పింది. త్వరలో నగరంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అందుకు అవసరమైన స్థలాలు గుర్తిస్తున్నామని.. 5 నుంచి 10 అంతస్తుల్లో వీటిని నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు.