తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదల కోసం రూఫ్ లెవెల్ ఫోటోలు తప్పనిసరి కావడంతో గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రాణాలు పణంగా పెడుతున్నారు. కింద నుంచి తీసిన ఫోటోలు అప్లోడ్ కాకపోవడంతో.. భద్రతా పరికరాలు లేకుండానే ఇళ్లపైకి ఎక్కి, నిచ్చెనల సాయంతో ఫోటోలు తీస్తున్నారు. అది రిస్కుతో కూడుకున్నదని.. అధికారులు ఫోటో అప్లోడ్ విధానాల్లో మార్పులు, డ్రోన్ల వినియోగానికి అనుమతి ఇవ్వాలని సిబ్బంది కోరుతున్నారు.