తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇల్లు కట్టుకోలేని లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు అందిస్తున్నారు. యాదాద్రి జిల్లాలో మొదటి విడతగా 9,175 ఇళ్లను మంజూరు చేయగా, ఇప్పటివరకు 393 మందికి రూ.4.34 కోట్ల రుణాలు అందజేశారు. త్వరలో మున్సిపాలిటీల్లోని లబ్ధిదారులకు కూడా రుణాలు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవండి