తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ పథకంపై బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ చీరలు ఉచితం కావని.. ఒక్కో చీరకు రూ.1,200 అప్పుగా రాస్తున్నారని, ఆధార్, వేలిముద్రల సేకరణ వెనుక మోసం దాగి ఉందని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో మహిళల నుంచి డబ్బులు వసూలు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.