తెలంగాణలో కేసీఆర్ పాలనలో ప్రతి చేనుకు నీళ్లు అందించగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి పల్లెకు మద్యాన్ని అందిస్తోందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో మద్యం అమ్మకాలు పెరిగి, రాష్ట్రం తాగుబోతుల తెలంగాణగా మారుతోందని ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ఇది తెలంగాణ ప్రగతిని దెబ్బతీసే చర్య అని ఆయన అన్నారు. ఒక వ్యక్తి సగటున మద్యం కోసం చేసే ఖర్చు గణనీయంగా పెరిగిందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.