ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్, స్టీల్ను తక్కువ ధరకే అందించాలని తెలంగాణ ప్రభుత్వం కంపెనీలతో చర్చలు జరుపుతోంది. పెరిగిన ధరలతో లబ్ధిదారులపై అదనపు భారం పడుతుండటంతో, సిమెంట్ బస్తా రూ.260కి, టన్ను స్టీల్ రూ.47 వేలకు అందించాలని ప్రభుత్వం కోరింది. 4.50 లక్షల ఇళ్లకు 40.50 లక్షల టన్నుల సిమెంట్, 68 లక్షల టన్నుల స్టీల్ అవసరం కాగా.. త్వరలో ధర తగ్గింపుపై కంపెనీలు ప్రకటన చేసే అవకాశం ఉంది.