మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరసేవలు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్లో పౌరసేవలను 700లకు పెంచాలని నిర్ణయించింది. ఆగస్ట్ 15వ తేదీ నాటికి 700 పౌర సేవలను మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను జనవరిలో ప్రారంభించారు. 161 సేవలతో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం కాగా.. ఈ సేవలను క్రమంగా వేయికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.