నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే లేడీ అఘోరీ మరోసారి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అఘోరీ, వర్షిణిల పెళ్లి వ్యవహారం నెట్టింట తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ట్రోలింగ్, కేసులతో విసిగిపోయిన ఈ జంట.. సంచలన ప్రకటన చేసింది. తమ జోలికి వస్తే ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరిస్తూ... ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తాము కేదార్నాథ్ వెళ్లిపోతున్నామని, ఇక తెలుగు రాష్ట్రాలకు రామని వీడియోలో చెప్పుకొచ్చారు. కాగా.. ఈ వీడియో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.